తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2019, 5:01 PM IST

ETV Bharat / bharat

రఫేల్​ పత్రాలు మాయం..!

రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పందంలోని కీలక పత్రాలు రక్షణ శాఖ నుంచి అపహరణకు గురయ్యాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. విచారణను మార్చ్​ 14కు వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.

సుప్రీంలో రఫేల్​పై విచారణ

రఫేల్ అంశంలో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ శాఖ నుంచి అపహరణకు గురయ్యాయని కోర్టుకు అటార్నీ జనరల్​ కెకె. వేణుగోపాల్ విన్నవించారు.

రఫేల్​ విషయంలో ప్రభుత్వానికి క్లీన్​చిట్​ ఇచ్చిన తీర్పును కేంద్రమంత్రులు యశ్వంత్​ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్ సవాలు చేశారు. ఈ పిటిషన్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు బుధవారం స్వీకరించింది.

వ్యాజ్యంపై భూషణ్‌ వాదనలు వినిపించారు. గతంలో రఫేల్‌పై విచారణలో అసత్య నివేదికలు ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని వివరించారు.

రఫేల్​కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఓ పత్రిక ఇటీవల ప్రచురించింది. తాజాగా రక్షణ శాఖ నుంచి పత్రాలు చోరీకి గురయ్యాయని కోర్టుకు కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని యోచిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సమీక్ష వ్యాజ్యాలను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని ఏజీ కోరారు. కీలక పత్రాలను దొంగిలించారని ఒక పత్రికపై కేంద్రం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అటార్నీ జనరల్​ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫలితంగా మార్చ్ 14కు విచారణ వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

రఫేల్‌ ఒప్పందంలో సందేహించాల్సిన తప్పిదాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి గతేడాది డిసెంబరు 14న సుప్రీం సచ్ఛీలత పత్రమిచ్చింది.

ఇదీ చూడండి:కారుపార్కులో వర్ణమాల

ABOUT THE AUTHOR

...view details