తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంట బీమా కచ్చితమా.. ఐచ్ఛికమా..?

పంట బీమా పథకంపై లోక్​సభలో చర్చ సాగింది. ఈ పథకాన్ని కచ్చితంగా అందరికీ వర్తింపజేయాలా లేదా రైతుల ఇష్టానికే(ఐచ్ఛికం) వదిలేయాలా అన్న అంశంపై అభిప్రాయం తెలపాలని అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్లు దిగువ​సభకు తెలిపింది కేంద్రం.

By

Published : Jun 25, 2019, 3:13 PM IST

పంటల బీమా పథకంపై లోక్​సభలో చర్చ

పంట బీమా అమలు అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది కేంద్రం. ఇది కచ్చితంగా అందరు రైతులకు వర్తింపజేయాలా లేదా వారి ఎంపికకే వదిలేయాలా అన్న అంశంపై నిర్ణయించేందుకే అభిప్రాయాలు కోరినట్టు లోక్​సభలో తెలిపింది కేంద్రం.

ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా ఈ విధంగా బదులిచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం కచ్చితంగా అమలుకు నోచుకోవాల్సిన అవసరముంది.

పంట బీమా పథకంపై లోక్​సభలో కేంద్ర మంత్రి రూపాలా సమాధానం

''కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలు ఈ పథకాన్ని స్వచ్ఛందంగా అమలుచేయాలని డిమాండ్​ చేసిన అనంతరం.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ లేఖ రాశాం. రుణాలు పొందిన వారికి పథకాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరముంది. రుణాలు ఇంకా పొందని వారికి ఐచ్ఛికంగా ఉంచాలని చూస్తున్నట్లు లేఖలో తెలిపాం.''

- పురుషోత్తం రూపాలా, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి

ABOUT THE AUTHOR

...view details