తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పారికర్​ నియోజకవర్గంలో ఎగిరిన కాంగ్రెస్​ జెండా

గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ స్థానాన్ని నిలబెట్టుకోవటంలో అధికార భాజపా విఫలమైంది. పనాజీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ జయకేతనం ఎగరవేసింది. భాజపా అభ్యర్థి సిద్ధార్థ్​ కున్​కోలియెంకర్​పై కాంగ్రెస్​ అభ్యర్థి అటానసియో మోన్సెర్రట్టే విజయం సాధించారు.

By

Published : May 23, 2019, 1:39 PM IST

పారికర్​ నియోజకవర్గంలో ఎగిరిన కాంగ్రెస్​ జెండా

గోవాలో భాజపాకు కంచుకోటైన పనాజీ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్​ విజయం సాధించింది. ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ మృతితో జరిగిన ఉపఎన్నికల్లో అధికార భాజపాకు తీవ్ర నిరాశ మిగిలింది.

1994 నుంచి పారికర్​...

1994 నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి పారికర్​ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే ఆయన కాలం చేయటం వల్ల ఆ స్థానం ఖాళీ ఏర్పడింది.

1,775 మెజార్టీతో గెలుపు

లోక్​సభ ఎన్నికలతో పాటు పనాజీ స్థానానికి నిర్వహించిన ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి సిద్ధార్థ్​ కున్​కోలియెంకర్​పై కాంగ్రెస్​ అభ్యర్థి అటానసియో మోన్సెర్రట్టే 1,775 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

12 స్థానాలకే పరిమితం..

ప్రస్తుతం 40 సీట్ల గోవా అసెంబ్లీలో భాజపా బలం 12. మిత్రపక్షాలు మహారాష్ట్రవాది గోమంటక్​ పార్టీ, గోవా ఫార్వర్డ్​ పార్టీలతో పాటు ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో అధికారం దక్కించుకుంది.

కాంగ్రెస్​కు 15 స్థానాల బలమున్నా మిత్రపక్షాలను కలుపుకోవటంలో విఫలమై ప్రతిపక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇదీ చూడండి:నమో 2.0: యావత్​ భారతం 'కాషాయ' శోభితం

ABOUT THE AUTHOR

...view details