తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీరం దాటిన తుపాను...పెనుగాలుల బీభత్సం

తూర్పు తీరాన్ని వణికిస్తోన్న ఫొని తుపాను తీరాన్ని దాటింది. ఒడిశా పూరికి దక్షిణంగా ప్రచండ తుపాను తీరాన్ని పూర్తిగా దాటింది.

By

Published : May 3, 2019, 9:34 AM IST

Updated : May 3, 2019, 10:39 AM IST

పురీ వద్ద తీరం దాటిన ఫొని

ప్రచండ గాలులతో విరుచుకుపడుతున్న ఫొని తుపాను ఒడిశా పూరికి దక్షిణంగా తీరాన్ని పూర్తిగా దాటింది. ప్రచండ గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్రమక్రమంగా తుపాను బలహీనపడనుంది. బాలాసోర్​ వద్ద తిరిగి సముద్రంలోకి వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు.. భీకర గాలులు వీస్తున్నాయి. గంజాం జిల్లాలో గంటకు 175 కిమీ వేగంతో గాలులు కల్లోల పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. పూరికి సమీపంలో 200 నుంచి 240 కిమీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి.

అనంతరం.. కోల్​కతాను దాటి తుపాను బంగ్లాదేశ్ వైపు​ వెళ్లనుంది. ఈ లోగా క్రమంగా తుపాను తీవ్రత బలహీనపడే అవకాశముంది.

ఇళ్లు వదిలిన తీర వాసులు

తూర్పు తీరంలోని గ్రామాల ప్రజలు స్వగృహాలు వదలి సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకుంటున్నారు. నిర్వాసితుల కోసం ఒడిశాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తూర్పు తీర రైల్వే మరో 10 రైళ్లు రద్దు చేసింది. ఒకటో తేది నుంచి మూడో తేది మధ్య 147 రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి.

పూరి వద్ద తీరం దాటిన ఫొని- భారీ వర్షాలు

ఇదీ చూడండి: విష సర్పాలతో ప్రియాంక సరదా ఆట

Last Updated : May 3, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details