తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ములో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లోని గోపాల్​పొర ప్రాంతంలో ఎన్​కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ​

By

Published : May 22, 2019, 9:15 AM IST

Updated : May 22, 2019, 9:52 AM IST

జమ్ములో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో బుధవారం తెల్లవారుజామున ఎన్​కౌంటర్​ జరిగింది. కుల్గామ్​లోని గోపాల్​పొర ప్రాంతంలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు ఘటనాస్థలంలో ఉన్నట్టు సమాచారం.

గోపాల్​పొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో జవాన్లపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ముష్కరులపై ఎదురుకాల్పులు జరిపారు జవాన్లు. భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. పరిసర ప్రాంతంలో అంతర్జాల సేవలను​ సేవలను నిలిపివేశారు.

ఇదీ చూడండి:'బౌలర్లు సూపర్​ ఫిట్... భారత జట్టు తప్పక హిట్​'

Last Updated : May 22, 2019, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details