తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ విచారణకు హాజరవనున్న ​డీకే శివకుమార్​

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్​ కేసుకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు దిల్లీలోని తమ కార్యాలయానికి హాజరవాలని నోటీసులు పంపింది.

By

Published : Aug 30, 2019, 12:37 PM IST

Updated : Sep 28, 2019, 8:34 PM IST

శివకుమార్​కు ఈడీ సమన్లు.. మరికాసేపట్లో విచారణ​

కాంగ్రెస్​ సీనియర్​ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​కు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్​ కేసుకు సంబంధించి ఈడీ గతంలో జారీ చేసిన సమన్లను ఎదిరిస్తూ.. శివకుమార్​ కర్ణాటక హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. కాంగ్రెస్​ నేత వ్యాజ్యాన్ని గురువారం విచారించిన కోర్టు.. ఆయన పిటిషన్​ను తోసిపుచ్చింది.

ఈ నేపథ్యంలో మరోసారి శివకుమార్​కు సమన్లు జారీ చేసింది ఈడీ. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు దిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా తాజాగా నోటీసులు పంపింది. ఇదే విషయాన్ని ధ్రువీకరించిన శివకుమార్​ దిల్లీకి బయలుదేరారు. "ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు దురుద్దేశంతో సమన్లు జారీ చేసినప్పటికీ.. చట్టంపై ఉన్న నమ్మకంతో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని" చెప్పారు శివకుమార్.

Last Updated : Sep 28, 2019, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details