తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ద్రవిడ్ ఇల్లు మారారు.. అందుకే ఓటు లేదు'

ఓటర్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్​ రాహుల్​ ద్రవిడ్​ పేరు లేకపోవడంపై కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆయన ఇల్లు మారిన తర్వాత కొత్త చిరునామాతో కూడిన వివరాలను సమర్పించలేదని, అందుకే ఇలా జరిగిందని చెప్పారు.

By

Published : Apr 15, 2019, 4:37 PM IST

ద్రవిడ్

టీమిండియా మాజీ కెప్టెన్​ రాహుల్ ద్రవిడ్​ ఓటు గల్లంతు అంశంపై కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్​ సంజీవ్ కుమార్ స్పందించారు. ఇల్లు మారిన ద్రవిడ్... కొత్త చిరునామాతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించలేదని, అందుకే ఆయన పేరు ఓటరు జాబితాలో లేకపోవచ్చని సీఈఓ వివరణ ఇచ్చారు.

"కొత్త చిరునామాతో కూడిన వివరాలను ద్రవిడ్ ఎలక్టోరల్​ కార్యాలయంలో సమర్పించలేదు. ఇందుకు సంబంధించి ఆయన ఇంత వరకు ఎలాంటి ముందడగు వేయలేదు" --సంజీవ్ కుమార్, కర్ణాటక సీఈఓ

కర్ణాటక ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్​గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఓటు గల్లంతవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

రాహుల్ ద్రవిడ్ ఇప్పటివరకు తన పూర్వీకుల ఇంట్లో ఉండేవారు. ప్రస్తుతం వేరే గృహానికి మకాం మార్చారు. ఓటును తొలగించేందుకు ద్రవిడ్ పాత ఇంట్లో ఉంటున్న ఆయన సొదరుడు ఫామ్-7 పత్రం సమర్పించారు.

ఏప్రిల్ 18న కర్ణాటకలో లోక్​సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details