తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్తివరధర్​ ఆలయానికి కోటి మంది భక్తులు!

తమిళనాడులో 46 రోజుల పాటు జరిగే అత్తివరధర్​ దర్శనం చివరి ఘట్టానికి చేరుకుంది. 45వ రోజు దాదాపు 95 లక్షల మంది ఆలయాన్ని సందర్శించారు. చివరి రోజైన శుక్రవారం.. భక్తుల సంఖ్య కోటి దాటుతుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

By

Published : Aug 16, 2019, 10:19 AM IST

Updated : Sep 27, 2019, 4:10 AM IST

అథి వరధార్​ ఆలయానికి కోటి మంది భక్తులు!

అత్తివరధర్​ ఆలయానికి కోటి మంది భక్తులు!

తమిళనాడు కంచీపురంలో వరదజపెరుమాళ్​ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం ఒక్క రోజే ఆలయంలోని అత్తివరధర్​ విగ్రహాన్ని దాదాపు 95 లక్షల మంది దర్శించుకున్నారు. వీఐపీ దర్శనాన్ని గురువారం మధ్యాహ్నం నిలిపివేశారు. సాధారణ దర్శనం రాత్రి 8 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి ఆలయంలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది.

జన సందోహంతో 45 రోజులుగా ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారమే(46వ రోజు) అత్తివరధర్​ దర్శనానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య కోటి దాటుతుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

40 ఏళ్లకు ఒకసారి 46 రోజుల పాటు...

ఈ వరదజపెరుమాళ్​ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్వామి.. ఆలయంలోని అనంత సరోవరం కోనేరులో విశ్రాంతి తీసుకుంటూ.. 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు.

40 ఏళ్లకు ఒక్కసారి 46 రోజుల పాటు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. అందుకే కనులారా చూసి తరించేందుకు భక్తులు తాపత్రయపడుతున్నారు.

ఇదీ చూడండి:- ఓ సామాన్యుడు జాతిపితగా ఎలా మారాడు?

Last Updated : Sep 27, 2019, 4:10 AM IST

ABOUT THE AUTHOR

...view details