తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు సియాచిన్​ యుద్ధభూమికి రాజ్​నాథ్​..

కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేడు సియాచిన్​, శ్రీనగర్​లలో పర్యటించనున్నారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సియాచిన్​ వెళ్లనున్న రాజ్​నాథ్​.. అక్కడి భద్రత పరిస్థితులను సమీక్షించనున్నారు.

By

Published : Jun 3, 2019, 5:13 AM IST

Updated : Jun 3, 2019, 5:45 AM IST

నేడు సియాచిన్​ యుద్ధభూమికి రాజ్​నాథ్​..

నేడు సియాచిన్​ యుద్ధభూమికి రాజ్​నాథ్​..

ప్రపంచంలోనే ఎత్తయిన సైనిక స్థావరం సియాచిన్​ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు సందర్శించనున్నారు. అక్కడి భద్రతా పరిస్థితులను సమీక్షించనున్నారు. అనంతరం.. అక్కడ యుద్ధ స్మారకానికి పునాది రాయి వేయనున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధభూమి.. సియాచిన్​ గ్లేసియర్​కు వెళ్లి అక్కడి ఫీల్డ్​ కమాండర్లు, సైనికులతో మాట్లాడనున్నారు రక్షణ మంత్రి. సైన్యాధిపతి బిపిన్​ రావత్​, ఇతర రక్షణ శాఖ అధికారులు రాజ్​నాథ్​తో పాటు సియాచిన్​ వెళ్లనున్నారు.

అనంతరం జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​కు చేరుకుంటారు రాజ్​నాథ్​. పాకిస్థాన్​తో భారత సరిహద్దుల వెంట భద్రతా బలగాల పర్యవేక్షణ, పరిస్థితుల గురించి అధికారులు.. మంత్రికి నివేదించనున్నారు. ఉగ్రవ్యతిరేక కార్యకలాపాలపైనా సమీక్ష నిర్వహించనున్నారు కేంద్ర మంత్రి.

శ్వాస తీసుకోవడానికి సైతం కష్టంగా ఉండే ప్రాంతం సియాచిన్​. 23 వేల అడుగుల ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి, అక్కడ కొంతమంది సైనికులను మోహరించింది.

ఇదీ చూడండి:5 నెలల్లో 101 మంది ముష్కరులు హతం

Last Updated : Jun 3, 2019, 5:45 AM IST

ABOUT THE AUTHOR

...view details