తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ గాంధీ, ఏచూరికి కోర్టు సమన్లు

వివేక్​ చంపనేర్కన్​ అనే ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త ఠానే నగర కోర్టులో రాహుల్​ గాంధీ, సీతారాం ఏచూరిలపై పరువు నష్టం దావా వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... రాహుల్​, ఏచూరికి సమన్లు జారీ చేసింది. ఈ నెల 30న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.

By

Published : Apr 3, 2019, 6:54 AM IST

రాహుల్​ గాంధీ, సీతారాం ఏచూరి

కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిలకు సమన్లుజారీ చేసింది మహారాష్ట్ర ఠానేలోని ఓ న్యాయస్థానం. ఏప్రిల్​ 30న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

పాత్రికేయురాలు గౌరీ లంకేశ్​ హత్యను తమ సంస్థకు ముడిపెడుతూ ఆరోపణలు చేశారని వివేక్​ చంపనేర్కన్​ అనే ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త కోర్టులో రాహుల్​ గాంధీ, ఏచూరిలపై పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విచారణ సందర్భంగా వారికి సమన్లు జారీ చేసింది న్యాయస్థానం.

రాహుల్​, ఏచూరి ఏప్రిల్​ 30న కోర్టులో హాజరుకావాలని సివిల్​ జడ్జి జేఎస్​ భాటియా ఆదేశించారు.

ఇదే అంశంపై రాహుల్​ గాంధీ, ఏచూరిలపై మరో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త వేసిన దావాను ఇప్పటికే విచారిస్తోంది ముంబయి మెట్రోపాలిటన్​ మేజిస్ట్రేట్​ కోర్టు.

ABOUT THE AUTHOR

...view details