తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రికార్డ్​ స్థాయి విజృంభణ: కొత్తగా 62,538 కేసులు

భారత్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా కేసుల సంఖ్య 20 లక్షల మార్క్​ను దాటింది. దేశవ్యాప్తంగా 62,538 కొత్త కేసులు నమోదయ్యాయి.

By

Published : Aug 7, 2020, 10:03 AM IST

Updated : Aug 7, 2020, 10:32 AM IST

CORONA CASES DETAILS
కరోనా ఉగ్రరూపం: 20 లక్షలు దాటిన కేసులు

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా 62 వేల 538 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మరో 886 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 41 వేలు దాటింది.

దేశంలో కరోనా కేసుల వివరాలు

రికవరీ రేటు ఇలా..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రికవరీ రేటులో పెరుగదల నమోదవ్వగా.. మరణాల రేటు కాస్త ఊరటకలిగిస్తోంది. దేశంలో రికవరీ రేటు 67.98 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.05 శాతంగా నమోదైంది.

9 రోజుల్లోనే 5లక్షల కేసులు..

గడిచిన తొమ్మిది రోజుల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా ఐదు లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి 21రోజుల సమయం పడుతోంది.

ఇదీ చదవండి:'కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స'

Last Updated : Aug 7, 2020, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details