తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2019, 9:31 AM IST

ETV Bharat / bharat

'జిన్నా పేరు ఉచ్ఛరించడం పొరపాటు మాత్రమే'

'కాంగ్రెస్ పార్టీ.. గాంధీ, పటేల్​, జిన్నా ప్రతిరూప'మని చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఆ పార్టీ నేత శతృఘ్న సిన్హా. స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ పేరుకు బదులుగా పొరపాటున పాకిస్థాన్​ పితామహుడు మహ్మద్​ అలీ జిన్నా అని ఉచ్ఛరించినట్లు తెలిపారు. ఇందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

శతృఘ్న సిన్హా

నోరు జారి పొరపాటున పాకిస్థాన్​ జాతిపిత మహ్మద్​ అలీ జిన్నా పేరును వాడానని కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. ఛింద్​వాడా బహిరంగ సభలో ప్రసంగిస్తూ... కాంగ్రెస్​లో ప్రముఖుల పేర్లను సిన్హా ప్రస్తావించటం వివాదాస్పదమయింది.

శతృఘ్న సిన్హా

"కాంగ్రెస్.. మహాత్మా గాంధీ, సర్దార్​ పటేల్​, అలీ జిన్నా, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ, రాహుల్​ గాంధీ లాంటి వ్యక్తులున్న పార్టీ. స్వాతంత్రోద్యమం నుంచి దేశాభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకం. నేను కాంగ్రెస్​లో చేరింది అందుకే. ఇక ఒకసారి వచ్చానంటే పార్టీని వీడటం అంటూ జరగదు."
-శతృఘ్న సిన్హా, కాంగ్రెస్ నేత

విమర్శల వెల్లువ

సిన్హా వ్యాఖ్యలపై ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. దేశాన్ని విభజించిన వ్యక్తిని కాంగ్రెస్ కీర్తిస్తోందని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా.

పొరపాటు మాత్రమే

తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన సిన్హా... జిన్నా పేరును పొరపాటుగా పలికానని స్పష్టం చేశారు.

"మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ పేరుకు బదులుగా జిన్నా అని ఉచ్ఛరించాను. ప్రసంగావేశంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే అవి. పొరపాటే తప్ప ఉద్దేశపూరితమైనవి కావు. ఇందులో క్షమాపణలు చెప్పడానికి ఏమీ లేదు."
-శతృఘ్న సిన్హా, కాంగ్రెస్ నేత

ఇదీ చూడండి: 4వ దశ ఎన్నికల ప్రచార అంకం సమాప్తం

ABOUT THE AUTHOR

...view details