తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​ నెహ్రూ చొరవ ఫలితమే: కాంగ్రెస్

చంద్రయాన్​-2 విజయంపై భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతటి ఘన విజయానికి పునాదులు వేసింది కాంగ్రెస్​ గత నాయకులేనని ఆ పార్టీ పేర్కొంది. శాస్త్రవేత్తల విజయానికి కాంగ్రెస్​ రాజకీయ రంగు పులుముతోందని భాజపా మండిపడింది.

By

Published : Jul 23, 2019, 7:16 AM IST

Updated : Jul 23, 2019, 4:40 PM IST

చంద్రయాన్​

చంద్రయాన్​-2 విజయవంతం కావటం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ విజయానికి పార్టీ గత నాయకత్వమే కారణమని చెప్పేందుకు ప్రయత్నించింది. అంతరిక్ష పరిశోధనలకు భారత తొలి ప్రధాని జవహార్​ లాల్​ నెహ్రూతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ ఎంతో కృషి చేశారని తెలిపింది.

"చంద్రయాన్​-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో బృందానికి అభినందనలు. భారత తొలి ప్రధాని జవహార్​ లాల్​ నెహ్రూ చేసిన సేవలను గుర్తుతెచ్చుకునేందుకు ఇది మంచి సమయం. ఆయన ఇంకోస్పార్​(ఇప్పుడు ఇస్రో)ను 1962లో నెలకొల్పి నిధులు కేటాయించారు. ఆ తర్వాత చంద్రయాన్​ ప్రాజెక్టుకు 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​ పచ్చజెండా ఊపారు."

-కాంగ్రెస్ పార్టీని

తప్పుబట్టిన భాజపా

సంబిత్ పాత్ర ట్వీట్

కాంగ్రెస్​ ప్రకటనపై భాజపా మండిపడింది. శాస్త్రవేత్తల విజయానికి కాంగ్రెస్​ రాజకీయ రంగు పులుముతోందని ఆరోపించారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర.

"కాంగ్రెస్​ చేసిన ప్రకటన తప్పుదారి పట్టించేందుకే. ప్రతి భారతీయుడికి గర్వపడే విజయమిది. దీనికి రాజకీయ రంగు పులమటం సరికాదు. భావి నాయకత్వం లేనప్పుడు గత నాయకులను గుర్తు చేసుకోక మరేం చేస్తారు?"

- సంబిత్​ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి

కాంగ్రెస్ నేతల సమర్థన

భాజపా స్పందన తర్వాత కాంగ్రెస్​ ప్రకటనను సమర్థించేందుకు ఆ పార్టీ సీనియర్​ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రయత్నించారు.

"2019 జులై 22.. భారత అంతరిక్ష ప్రస్థానంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. డాక్టర్​ శివన్​ బృందానికి నా సెల్యూట్​. 2019 సెప్టెంబర్​లో లూనార్​ ప్రోబ్​ చంద్రుడిపై దిగే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. 2008 అక్టోబర్​ 22న ఈ ఘట్టానికి పునాది పడింది."

పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత

ఇదీ చూడండి: సూర్యుడి చెంతకు త్వరలో ఆదిత్య: ఇస్రో

Last Updated : Jul 23, 2019, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details