తెలంగాణ

telangana

By

Published : Feb 1, 2020, 6:02 AM IST

Updated : Feb 28, 2020, 5:55 PM IST

ETV Bharat / bharat

చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!

భారతదేశం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలకు నెలవు. ఏ ఆలయమైనా నమూనా చిత్రాన్ని గీసుకొని నిర్మించడం సాధారణమే. అయితే హిమాచల్​ ప్రదేశ్​లోని ఓ ఆలయం ప్రత్యేకతే వేరు! ఈ కోవెల నిర్మాణానికి చీమలు అద్భుత రూపంలో చిత్రపటాన్ని గీశాయట. దాని ప్రకారమే ఆ గుడి రూపుదిద్దుకుందని ప్రతీతి. అదే 'చిండీ మాత' ఆలయం. ఇంతకీ ఆ చీమలేంటి.. ఆలయ చిత్రం గీయడమేంటనుకుంటున్నారా.! అయితే ఈ కథ చదవాల్సిందే...

'Chindi Mata': A temple in Himachal mapped by ants
చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!

చీమలు గీసిన పటంతో నిర్మితమైన మండీలోని చిండీమాత ఆలయం

హిమాచల్​ప్రదేశ్​లోని సుందరమైన పర్వతాలలో.. ఓ మారుమూల గ్రామంలో ప్రసిద్ధ దుర్గామాత ఆలయం ఉంది. మండీ జిల్లాలోని కర్​సోగ్​లో సుమారు 1,404 మీటర్ల ఎత్తులో ఈ మందిరం కొలువై ఉంది. దేశంలో ఎన్నో దేవాలయాలున్నప్పటికీ ఈ గుడి మాత్రం భిన్నం. కారణమేంటంటే 'చిండీ మాత' ఆలయంగా పిలిచే ఈ గుడికి చీమలు పటాన్ని రూపొందించాయట.

అమ్మాయి రూపంలో...

ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహంతో సహా 'అష్ఠాభుజ' పేరుతో అమ్మవారు కొలువై ఉంటారు. ఆలయ ప్రాంగణ గోడలపై ఉన్న చిత్రాలు కనులవిందు చేస్తాయి. ఇక్కడ అమ్మవారిని అమ్మాయిగా అలంకరిస్తారు.

అప్పట్లో స్థానిక పూజారికి ఈ అమ్మవారే కలలో కనిపించి గుడిని నిర్మించాలని కోరిందట. దానికి చీమలదండు ఓ పటాన్ని గీశాయట. దాని ప్రకారమే ఈ గుడి నిర్మాణం జరిగిందని ఆ పూజారి కథనం.!

చంకరథ్​లో...

'చిండీ మాత' ప్రతి మూడేళ్లకోసారి తాత్కాలికంగా గుడిని వదిలివెళ్లిపోతారని స్థానికులు నమ్ముతారు. ఈ కథను చంకరథ్​లో నాటక రూపంలో ప్రదర్శన జరుపుతారు. సంతానం, ఆరోగ్యం కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక మొక్కులు చెల్లిస్తుంటారు.

ఇదీ చదవండి:'ప్లాస్టిక్ భూతం'​ వద్దు.. 'జనపనార' ముద్దు!

Last Updated : Feb 28, 2020, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details