తెలంగాణ

telangana

By

Published : May 2, 2019, 5:02 AM IST

ETV Bharat / bharat

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

కర్ణాటకలోని కొప్పల్​ జిల్లాలో ఓ చిరుత కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించి.. ఓ కుక్కపై దాడి చేసి పట్టుకుపోయింది. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయాందోళన చెందుతున్నారు.

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

కర్ణాటకలోని కొప్పల్​ జిల్లా గంగావతి గ్రామంలో ఓ చిరుతపులి కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో సాయినగర్​లోని ఓ ఇటుకల బట్టీ వద్దకు వచ్చిన పులి, ఓ కుక్క పిల్లపై దాడి చేసి పట్టుపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఈ ఘటనతో ఆందోళన చెందిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రూర మృగాలు గ్రామంలో ప్రవేశిస్తుండడంపై ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: కాశీలో మాజీ జవాను నామినేషన్​ తిరస్కరణ

ABOUT THE AUTHOR

...view details