తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంచులోనే నలుగురు

హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లాలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో పురోగతి సాధించారు అధికారులు. గల్లంతైన ఐదుగురు జవాన్లలో ఒకరి మృతదేహం లభ్యమైంది.

By

Published : Mar 2, 2019, 11:04 PM IST

మంచు చరియల్లోనే మరో నలుగురు జవాన్లు

హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లాలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో పురోగతి సాధించారు అధికారులు. 10 రోజుల అనంతరం ఒక సైనికుడి మృతదేహం దొరికింది. మరో నలుగురు జవాన్ల ఆచూకీ ఇంకా లభించలేదు.

ఫిబ్రవరి 20న కిన్నౌర్‌ జిల్లాలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఏడవ జమ్ముకశ్మీర్​ రైఫేల్​కు చెందిన ఆరుగురు సైనికులు మంచులో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన రోజే ఒకరి మృతదేహం దొరికింది.

గాలింపు చర్యల్లో 500 మంది

జవాన్ల కోసం సుమారు 500 మంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని కిన్నౌర్​ జిల్లా ప్రజాసంబంధాల అధికారి మమత నేగి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details