తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రి సమక్షంలో కార్యకర్తల ఘర్షణ..!

సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో మహారాష్ట్రాలో భాజపాకు చెందిన రెండు వర్గాల కార్యకర్తలు గొడవపడ్డారు. రాష్ట్ర మంత్రి సమక్షంలోనే కార్యకర్తలు బూట్లతో దాడికి పాల్పడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

By

Published : Apr 11, 2019, 7:56 AM IST

మంత్రి సమక్షంలో కార్యకర్తల ఘర్షణ..వీడియో వైరల్​

మంత్రి సమక్షంలో కార్యకర్తల ఘర్షణ..వీడియో వైరల్​

మహారాష్ట్రలోని జల్గావ్​లో భారతీయ జనతా పార్టీ సమావేశంలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తల గొడవే ఇందుకు కారణం.

రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి గిరీష్​​ మహాజన్​ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభా వేదికపై మంత్రి ఉండగానే కార్యకర్తలు దాడికి దిగారు. అందులో ఓ కార్యకర్త తన కాలి బూటును తీసి మరోవర్గంపై దాడి చేయటం ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే స్పందించిన పోలీసులు వేదికపై నుంచి గొడవపడే వారిని కిందికి తోసివేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి: ప్రపంచంలోని 15 కాలుష్య నగరాల్లో 14 మనవే

ABOUT THE AUTHOR

...view details