ఎన్నికల ప్రచారంలో ఏవిధంగా ప్రజల ముందుకుపోతున్నారు?
ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన కృషిని దిల్లీ ప్రజలు గుర్తిస్తున్నారు. భాజపా అధికారంలోకి వస్తే విద్యారంగంలో అభివృద్ధి నిలిచిపోతుంది. సర్కారు బడులు గుడారాల్లో నిర్వహించాల్సి వస్తుంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఒకవేళ భాజపా గెలిస్తే నోయిడా, గురుగ్రామ్,గాజియాబాద్లో చేసినట్లుగానే దిల్లీలోనూ ఫీజులను పెంచుతారు.
మేం అధికారం చేపట్టిన సమయంలో పాఠశాలల్లోని ఒక్క క్లాస్ రూమ్లో దాదాపు 174మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం ఒక్క రూమ్లో 70-80మంది కూర్చునేలా పాఠశాలలను అదనపు గదులతో ఆధునికీకరించాం. దిల్లీలో చేయాల్సిన పని చాలా ఉంది. ఎంతో కష్టపడి మా సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది.
మా ప్రభుత్వం ఏర్పడ్డాక దిల్లీలో 16 కొత్త కళాశాలలను ప్రారంభించాం. ఈ ఏడాది దిల్లీవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1.6లక్షల మంది అడ్మిషన్లు పొందారు. గత సంవత్సరం కంటే 70వేల మంది అదనంగా ఈ సంవత్సరం ఉన్నత విద్యలో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థికి కూడా రాబోయే ఐదేళ్లలో మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుందని మేం హామీ ఇస్తున్నాం.
కేజ్రీవాల్ ఎంతో వ్యయానికోర్చి దిల్లీలోని గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ ఛార్జీలను తగ్గించారు. ఈ ఎన్నికల్లో మేం గెలిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని ప్రకటించాం. అదే భాజపా గెలిస్తే దిల్లీ వాసులు విద్యుత్ బిల్లులను రూ.4వేల నుంచి 5 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాలనే మేం ప్రజలకు చెబుతున్నాం. వారు కూడా అర్థం చేసుకుంటున్నారు.