తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఆమోదానికి భాజపా కృషి

ఉగ్రవాద వ్యతిరేక చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాలని భాజపా కృషి చేస్తోంది. రేపు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడతున్న కారణంగా భాజపా ఎంపీలందరూ హాజరు కావాలని ఆ పార్టీ విప్​ జారీ చేసింది.

By

Published : Aug 1, 2019, 11:27 PM IST

భాజపా

ఉగ్రవాద నిర్మూలనకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)లో ప్రభుత్వం చేసిన సవరణల బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.

రాజ్యసభలో తక్కువ మెజారిటీ కారణంగా భాజపా ఎంపీలందరూ తప్పకుండా హాజరు కావాలని ఆ పార్టీ మూడు వ్యాక్యాల విప్​ జారీ చేసింది. ఇప్పటికే ఈ బిల్లుకు జులై 24న లోక్​సభ ఆమోదం తెలిపింది.

బిల్లుకు ఆమోదం లభిస్తే..

ఇప్పటివరకు ఉగ్రవాద సంస్థలపైనే నిషేధం విధించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండేది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే తీవ్రవాదులపై వ్యక్తిగతంగా ఉగ్రవాద ముద్ర వేసే అవకాశం భారత ప్రభుత్వానికి కలుగుతుంది. ఫలితంగా సదరు వ్యక్తి ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయి. ఇతర దేశాలతో ఆ ఉగ్రవాది పూర్తి వివరాలను భారత్​ పంచుకుంటుంది.

బిల్లు చట్టంగా మారగానే మొదటిగా పఠాన్​కోట్​, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారులు మసూద్​ అజార్​, హఫీజ్​ సయీద్​లపై ఉగ్రవాద ముద్ర వేస్తామని కేంద్ర హోంశాఖ అధికార వర్గం ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details