తెలంగాణ

telangana

భోపాల్ గ్యాస్​ కేసు నుంచి తప్పుకున్న జస్టిస్​ రవీంద్ర భట్​

భోపాల్​ గ్యాస్​ దుర్ఘటన బాధితులకు అదనంగా రూ. 7,844 కోట్లు పరిహారం ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్​పై విచారణ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ రవీంద్ర భట్​. ఫలితంగా విచారణ బుధవారానికి వాయిదా పడింది.

By

Published : Jan 28, 2020, 12:34 PM IST

Published : Jan 28, 2020, 12:34 PM IST

Updated : Feb 28, 2020, 6:36 AM IST

Bhopal gas tragedy: Justice S Ravindra Bhat recuses from hearing Centre's plea for additional fund
భోపాల్ గ్యాస్​ కేసు నుంచి తప్పుకున్న జస్టిస్​ రవీంద్ర భట్​

భోపాల్​ గ్యాస్​ దుర్ఘటనపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ నుంచి తప్పుకున్నారు జస్టిస్​ ఎస్​ రవీంద్ర భట్. గతంలో ఇదే కేసులో కేంద్రప్రభుత్వం తరఫున తాను వాదించడమే ఇందుకు కారణమని చెప్పారు. బాధితులకు అదనపు పరిహారంగా అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్(యూసీసీ)​ నుంచి రూ.7,844 కోట్లు ఇప్పించాలని కోరుతూ ఈ వ్యాజ్యం వేసింది కేంద్రం.

జస్టిస్​ రవీంద్ర తప్పుకున్న నేపథ్యంలో పిటిషన్​ విచారణను వాయిదా వేసింది జస్టిస్ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి బుధవారం నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేసింది.

భోపాల్ దుర్ఘటన...

1984 డిసెంబర్​లో యూనియన్​ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్​ ఐసోసైనేట్​ విషవాయువులు విడుదలై సుమారు 3000 మంది మృతి చెందారు. 1.02 లక్షల మందికిపైగా అనారోగ్యం పాలయ్యారు. బాధితులకు రూ.715 కోట్లు పరిహారంగా చెల్లించింది యూసీసీ.

ఇదీ చదవండి:ప్లాస్టిక్​ సీసాలతో అంగన్​వాడీ కేంద్రాల నిర్మాణం

Last Updated : Feb 28, 2020, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details