తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​ఐఏ' తనిఖీల్లో ముగ్గురు అనుమానితులు అరెస్ట్​

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని తమిళనాడులోని పూణమల్లే నగరంలో ఎన్​ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

By

Published : May 1, 2019, 6:14 AM IST

'ఎన్​ఐఏ' తనిఖీల్లో ముగ్గురు అనుమానితులు అరెస్ట్​

'ఎన్​ఐఏ' తనిఖీల్లో ముగ్గురు అనుమానితులు అరెస్ట్​

శ్రీలంక బాంబు పేలుళ్లతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులు పూణమల్లేకు దగ్గర్లోని గోల్డెన్​ రెసిడెన్స్​లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని చెన్నైలోని మన్నడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన ఎన్​ఐఏ... అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో పట్టుబడ్డ ముగ్గిరిపై ఎన్​ఐఏ అధికారులు 4 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details