తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఏఎస్​, ఐపీఎస్​ల కేడర్​ వివాదంపై 17న విచారణ

సివిల్ సర్వీస్ అధికారులకు కేడర్ కేటాయింపుల వివాదంపై ఈనెల 17న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తిరిగి కేటాయింపులు జరపాలన్న దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు విననుంది.

By

Published : May 13, 2019, 3:28 PM IST

Updated : May 13, 2019, 5:12 PM IST

ఐఏఎస్​, ఐపీఎస్​ల కేడర్​ వివాదంపై 17న విచారణ

ఐఏఎస్​, ఐపీఎస్​ల కేడర్​ వివాదంపై 17న విచారణ

2018 బ్యాచ్ సివిల్ సర్వీసు అధికారులకు కేడర్​ కేటాయింపులను రద్దు చేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరించింది సుప్రీం. మే 17న వాదనలు వింటామని వెల్లడించింది.

ప్రస్తుత కేడర్లు అసంబద్ధంగా ఉన్నాయని, 2017లో జరిపిన విధంగా ఆన్​లైన్​లో కేడర్​ కేటాయించాలని శిక్షణలో ఉన్న నలుగురు అధికారులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేటాయింపులను న్యాయస్థానం రద్దు చేసింది. ఈ తీర్పును కేంద్రం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

2018 బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్​లు శిక్షణ పూర్తి చేసుకుని, సేవలు అందించేదుకు సిద్ధంగా ఉన్నారు. మే 10నే వారు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎప్పుడు విధుల్లో చేరతారన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

ఇదీ చూడండి: దేశంలో మొదటి ఉగ్రవాది హిందువే: కమల్​

Last Updated : May 13, 2019, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details