తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముళ్ల పొదల్లో శిశువు- ఈ పాపం ఎవరిది..?

తమిళనాడులోని తిరునల్వేలిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ శిశువును పొదల్లో పడేసిన ఘటన కలకల రేపింది. ఆ పసికందును గుర్తించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. శిశువు క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

By

Published : Aug 19, 2019, 10:05 AM IST

Updated : Sep 27, 2019, 12:00 PM IST

పొదల్లో శిశువు- ఈ పాపం ఎవరిది..?

పొదల్లో శిశువు- ఈ పాపం ఎవరిది..?

తమిళనాడులో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. తిరునల్వేలిలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును పొదల్లో పడేసి వెళ్లిపోయారు. అరుపులు విన్న స్థానికులు... చిన్నారిని గుర్తించారు. వెంటనే ఆ ఆడ పిల్లను రక్షించి పోలీసులకు అప్పగించారు.

వైద్య పరీక్షల కోసం పసికందును పాలయన్​కొట్టయ్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని తెలిపారు. పూర్తిస్థాయి చికిత్స అనంతరం బిడ్డను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చూడండి:- వృద్ధులే కదా అని దొంగతనానికొస్తే.. తరిమేస్తాం!

Last Updated : Sep 27, 2019, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details