తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అభినందన' విజయమే

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్​ వర్ధమాన్​ను పాక్  తిరిగి భారత్​కు అప్పగించటం దౌత్య విజయమని భాజపా అధ్యక్షుడు అమిత్​షా అన్నారు.

By

Published : Mar 1, 2019, 12:43 PM IST

పాక్​ ప్రధానిపై అమిత్​షా విమర్శలు

వైమానిక దళ వింగ్ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ను తిరిగి అప్పగించడం దౌత్యపరమైన విజయమని భాజపా అధినేత అమిత్​షా హర్షం వ్యక్తం చేశారు. పుల్వామా దాడిని ఖండిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఒక్క ప్రకటనా చేయలేదని షా విమర్శించారు. ఇమ్రాన్​ను ఎలా నమ్మగలమని ప్రశ్నించారు. పరిస్థితులు పాక్ ప్రధాని నియంత్రణలో ఉండి ఉండకపోవచ్చు కానీ ఓ ప్రకటనా విడుదల చేయలేకపోవడం సరికాదన్నారు షా.

దిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు షా. పుల్వామా దాడి అనంతర పరిణామాలపై స్పందించారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులలో భయం పుట్టేలా ప్రతిస్పందించిందన్నారు. ఉగ్రవాద వ్యవహారాల్లో భారత ప్రభుత్వ తీరు మునుపెన్నడూ లేనివిధంగా ఉందని కమలదళపతి అభిప్రాయపడ్డారు. భాజపా ప్రభుత్వ పాలనలోనే ఎక్కువమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నారు షా.

పాక్​ యుద్ధ విమానాల్ని నిరోధించే క్రమంలో మిగ్-21 విమానం పాక్​ భూభాగంలో కూలింది. దానికి పైలట్​గా ఉన్న అభినందన్​ పారాషూట్​ ద్వారా పాక్​లో దిగి ఆ దేశ సైనికులకు చిక్కారు. శాంతికాముక చర్యగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆయనను స్వదేశానికి పంపిస్తామని గురువారం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details