తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మానసికంగా వేధించారు'

పాకిస్థాన్‌లో మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ చెప్పినట్టు ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది.

By

Published : Mar 2, 2019, 11:57 PM IST

అభినందన్​ను కలిసిన నిర్మలా సీతారామన్

పాకిస్థాన్​ చెర నుంచి విడుదలైన వాయుసేన వింగ్ కమాండర్​ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఆమెతో పాటుగా ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా ఉన్నారు. వారితో నిర్బంధంలో ఉన్నప్పటి పరిస్థితులను అభినందన్​ వివరించినట్లు ఆంగ్ల మీడియా సంస్థ తెలిపింది.

నిర్బంధంలో ఉన్న రెండున్నర రోజుల్లో శారీరక హింసకు గురికాలేదని స్పష్టం చేశారు అభినందన్. మానసికంగా వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు.

భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాక్.. 60 గంటల్లోనే అభినందన్​ను విడుదల చేసింది. శుక్రవారం వాఘా-అటారీ సరిహద్దులో అభినందన్​ను పాక్ అప్పజెప్పింది.

ఇదీ చూడండి:సంఝౌతా పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details