తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2019, 3:30 PM IST

Updated : Dec 20, 2019, 5:11 PM IST

ETV Bharat / bharat

'లగే రహో కేజ్రీవాల్': ఆప్ ఎన్నికల ప్రచారం షురూ

వచ్చే ఏడాది జరిగే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించింది ఆమ్​ ఆద్మీ పార్టీ. 'అచ్చే బీతే పాంచ్​ సాల్- లగే రహో కేజ్రీవాల్​' నినాదంతో మరోసారి గెలిపించాలని ప్రచారం నిర్వహించనుంది.

AAP poll campaign
'లగే రహో కేజ్రీవాల్': ఆప్ ఎన్నికల ప్రచారం షురూ

'లగే రహో కేజ్రీవాల్': ఆప్ ఎన్నికల ప్రచారం షురూ

దిల్లీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీ. 'అచ్చే బీతే పాంచ్​ సాల్​-లగే రహో కేజ్రీవాల్​' (గత ఐదేళ్ల పాలన బాగుంది-మళ్లీ కేజ్రీవాల్​నే గెలిపించండి) అనే నినాదంతో ప్రచారం ప్రారంభించింది.

దిల్లీ ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించే ఈ నినాదాన్ని ఎన్నికల ప్రచారంగా ఎంపిక చేశామన్నారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.

2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ 67 సీట్లను గెలుపొంది తిరుగులేని మెజారిటీ సాధించింది ఆప్​. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలతో బరిలోకి దిగుతోంది.

ఇదీ చూడండి: ఉన్నావ్​ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్​

Last Updated : Dec 20, 2019, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details