తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం

దిల్లీలోని సీలంపుర్​లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 22ఏళ్ల యువతి సహా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

By

Published : Sep 3, 2019, 5:34 AM IST

Updated : Sep 29, 2019, 6:08 AM IST

దిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం

దిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం

ఈశాన్య దిల్లీలోని సీలంపుర్​లో సోమవారం రాత్రి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ యువతి ఉంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు సమాచారం.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసింది అగ్నిమాపక సిబ్బంది.

నిర్మాణ దశలో ఉన్న భవనం కింద ఓ వేడుక జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఇదీ చూడండి:-మోదీకి 'గేట్స్​' పురస్కారం తెచ్చిన స్వచ్ఛ భారత్

Last Updated : Sep 29, 2019, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details