తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో కూలిన భవనం- నలుగురు మృతి

గుజరాత్​లో దారుణం జరిగింది. నడియాడ్​ ప్రగతినగర్​లోని ఓ మూడంతస్తుల భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

By

Published : Aug 10, 2019, 5:28 AM IST

Updated : Aug 10, 2019, 7:35 AM IST

గుజరాత్​లో కూలిన భవనం

తీర రాష్ట్రం గుజరాత్​ ఖేడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నడియాడ్​లోని ప్రగతినగర్​లో శుక్రవారం అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద ఇంకా చాలా మందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కూలిన భవనం.. పురాతనమైనదిగా తెలుస్తోంది.

గుజరాత్​లో కూలిన భవనం
Last Updated : Aug 10, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details