తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాలుష్య భూతం: దిల్లీ వదిలేందుకు 40 శాతం మంది సిద్ధం!

దేశ రాజధానిలో రోజురోజుకూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా దేశరాజధానిలో పరిస్థితులపై సర్వే నిర్వహించింది ఓ సంస్థ. కాలుష్య భూతం కారణంగా దిల్లీ, ఎన్​సీఆర్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 40 శాతం మంది అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సంసిద్ధత చూపుతున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.

By

Published : Nov 3, 2019, 2:15 PM IST

Updated : Nov 3, 2019, 6:31 PM IST

కాలుష్యం పెరిగిన దిల్లీలోనే ఉంటాం..!

దిల్లీ వదిలేందుకు 40 శాతం మంది సిద్ధం!

వాయు కాలుష్యం కారణంగా దిల్లీ, దేశ రాజధాని ప్రాంతం..ఎన్​సీఆర్​ నుంచి 40 శాతం మంది వేరే నగరానికి తరలిపోవాలని భావిస్తున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. మరో 16 శాతం మంది వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో దిల్లీ నుంచి వేరే చోటుకు పర్యటనకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

13 శాతం మంది తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని వాయు కాలుష్యం పెరిగినా దిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. 31 శాతం మంది ప్రజలు ఎయిర్‌ ఫ్యూరిఫైయర్లు, మాస్క్‌ల ద్వారా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటూ దిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌ వేదిక లోకల్‌ సర్కిల్స్‌ ఈ సర్వేను నిర్వహించింది.

దిల్లీ వాసులు 17 వేల మంది నుంచి ఈ మేరకు అభిప్రాయాలు సేకరించింది.

ఇదీ చూడండి:గర్భిణిని 5 కిలోమీటర్లు నీటిలో మోసుకెళ్లిన దృశ్యం!

Last Updated : Nov 3, 2019, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details