తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2019, 8:43 PM IST

Updated : Jul 11, 2019, 10:46 PM IST

ETV Bharat / bharat

25కుపైగా ప్రభుత్వ వెబ్​సైట్లు హ్యాక్​: రవిశంకర్​

ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 25కుపైగా కేంద్ర మంత్రిత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్​సైట్లు హ్యాక్​ అయినట్టు సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రాజ్యసభలో ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఐదు నెలల్లో 25కిపైగా ప్రభుత్వ వెబ్​సైట్లు హ్యాక్..​

ఈ ఏడాది మే నెల వరకు 25కు పైగా కేంద్ర మంత్రిత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్​సైట్లు హ్యాకింగ్​కు గురైనట్లు సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ వెల్లడించారు. రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. 2016లో 199, 2017లో 172, 2018లో 110 ప్రభుత్వ వెబ్​సైట్లు హ్యాక్​ అయినట్లు వివరించారు.

ప్రపంచ వ్యాప్తంగాసాంకేతిక పరిజ్ఞానం, ఇతర సేవల విస్తరణకు సైబర్​ దాడులు సమస్యగా మారయన్నారు రవిశంకర్​. ఈ దాడులకు ఓ పరిమితి లేదని, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా జరగే అవకాశముందని చెప్పారు.

సైబర్ దాడుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరణ ఇచ్చారు రవిశంకర్​. దేశంలో విలువైన సమాచార భద్రత కోసం నేషనల్​ క్రిటికల్​ ఇన్ఫర్మేషన్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్​ సెంటర్​(ఎన్​సీఐఐపీసీ)ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇండియన్​ కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీం(సీఈఆర్​టీ-ఇన్) సైబర్​ దాడులపై సమాచారం, సలహాలు ఇస్తుందన్నారు రవిశంకర్​.

ఇదీ చూడండి:భాజపా గూటికి 10 మంది గోవా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

Last Updated : Jul 11, 2019, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details