తెలంగాణ

telangana

నిర్భయ కేసు: దోషి వినయ్​ క్షమాభిక్ష పిటిషన్​

By

Published : Jan 29, 2020, 7:21 PM IST

Updated : Feb 28, 2020, 10:34 AM IST

2012-delhi-gang-rape-case-mercy-petition-has-been-filed-by-convict-vinay-sharma
నిర్భయ దోషి వినయ్​ క్షమాభిక్షను స్వీకరించిన రాష్ట్రపతి

19:14 January 29

నిర్భయ కేసు: దోషి వినయ్​ క్షమాభిక్ష పిటిషన్​

నిర్భయ కేసులో ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఉరి శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్​ కుమార్​ శర్మ క్షమాభిక్ష పిటిషన్​ వినియోగించుకున్నాడు. క్షమాభిక్ష కోరుతూ పిటిషన్​ దాఖలు చేయగా.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ స్వీకరించినట్లు వినయ్​ తరఫు న్యాయవాది ఏపీ సింగ్​ తెలిపారు. ఈ కారణంతో.. ఫిబ్రవరి 1న నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. మరోసారి మరణ శిక్ష వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదివరకే నిర్భయ కేసులో  వినయ్​ క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేయగా.. సుప్రీం కోర్టు కొట్టివేసింది.  వినయ్​ కంటే ముందు దోషుల్లో ఒకడైన  ముకేశ్​ కుమార్​ సింగ్​ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్​ను జనవరి 17న రాష్ట్రపతి తిరస్కరించారు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ముకేశ్‌ దాఖలు చేసిన మరో పిటిషన్​ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేసింది.

Last Updated : Feb 28, 2020, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details