తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదే కథ: ఈవీఎం సమస్యలు- బంగాల్​లో ఘర్షణలు

సార్వత్రిక ఆరో దశ పోలింగ్​లోనూ ఈవీఎం మొరాయింపులు ఈసీకి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ దిల్లీలోని పలుచోట్ల ఆలస్యంగా మొదలైంది. బంగాల్​లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటాల్​ నియోజకవర్గ భాజపా అభ్యర్థి భారతి ఘోష్​ వాహనశ్రేణిపై దాడి జరిగింది.

By

Published : May 12, 2019, 11:56 AM IST

Updated : May 12, 2019, 12:11 PM IST

అదే కథ: ఈవీఎం సమస్యలు- బంగాల్​లో ఘర్షణలు

సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటున్నా ఈవీఎం సమస్యలు మాత్రం వదలడం లేదు. దేశ రాజధాని దిల్లీలోని రైల్వే జుగ్గి, షకుర్​బస్తీ సహా పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు ఓటర్లతో పాటు ఈసీకి తలనొప్పి తెచ్చి పెట్టింది.

వేసవి కావడం వల్ల ఎండ తాకిడికి తట్టుకోలేక ఉదయాన్నే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలి వచ్చారు. అయితే ఈవీఎంల మొరాయింపుతో 3 పోలింగ్​ కేంద్రాల్లో 50 నిమిషాలు ఆలస్యంగా ఓటింగ్​ ప్రారంభమైంది. అప్పటివరకు ఓటర్లు క్యూలోనే వేచి ఉండాల్సి వచ్చింది. పలువురు ఓటర్లు ఈసీపై అసహనం వ్యక్తం చేశారు.

బంగాల్​లో మళ్లీమళ్లీ...

ఆరో విడత పోలింగ్​లోనూ బంగాల్​లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘాటాల్​ లోక్​సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి భారతి ఘోష్​ వాహనశ్రేణిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తృణమూల్​ కార్యకర్తలే దాడి చేశారని భాజపా నేతలు ఆరోపించారు.

అదే కథ: ఈవీఎం సమస్యలు- బంగాల్​లో ఘర్షణలు

కాల్పుల కలకలం...

ఆరోదశ పోలింగ్​ ముందు రోజు బంగాల్​లో స్వల్ప హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జాడ్​గ్రామ్​ నియోజకవర్గ పరిధిలోని గోపిబళ్లాపుర్​లో భాజపా కార్యకర్త శనివారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మరో ఇద్దరు కార్యకర్తలపై కాల్పులు జరిగాయి.

Last Updated : May 12, 2019, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details