తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకోర్టుకు 14 మంది కర్ణాటక రెబల్​ ఎమ్మెల్యేలు

కర్ణాటకలో అనర్హత వేటుకు గురైన 14 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పటి స్పీకర్‌ కేఆర్​ రమేశ్‌ కుమార్‌ తమ రాజీనామాలు తిరస్కరించి తమపై అనర్హత వేటు వేయడాన్ని వారు సుప్రీం కోర్టులో సవాలు చేశారు.

By

Published : Aug 1, 2019, 5:53 PM IST

సుప్రీం కోర్టుకు 14 మంది రెబల్​ ఎమ్మెల్యేలు

తమ రాజీనామాలతో కర్టాటక సంకీర్ణ కూటమి ప్రభుత్వం కూలడానికి కారణమైన అంసతృప్త ఎమ్మెల్యేలు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పటి స్పీకర్​ కేఆర్​ రమేశ్ కుమార్​ వారిపై వేసిన అనర్హత వేటును సవాల్​ చేస్తూ పిటిషన్​ దాఖలు చేశారు. రాజీనామాలను తిరస్కరించి తమపై అనర్హత వేటు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.​

ఇప్పటికే అనర్హత వేటు పడిన ఇద్దరు కాంగ్రెస్, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ 14 మందితో కలిపి ఆ సంఖ్య 17కి చేరింది. వీటిపై త్వరలోనే సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details