తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుణె: ప్రహరీ గోడ కూలి 17 మంది బలి

మహారాష్ట్ర పుణెలోని కొంఢ్వాలో ప్రహరీ గోడ కూలి 17 మంది మరణించారు. మరి కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

By

Published : Jun 29, 2019, 7:21 AM IST

Updated : Jun 29, 2019, 12:12 PM IST

పుణె

పుణెలో కూలిన గోడ

మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని కొంఢ్వా ప్రాంతంలో ఓ సొసైటీ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

శుక్రవారం రాత్రి 1.45 గంటల ప్రాంతంలో సొసైటీ పక్కనే భవన నిర్మాణ కూలీల కోసం వేసిన తాత్కాలిక షెడ్లపై గోడ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు కూలీలు.

పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ దళాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: సరిహద్దులో అందుబాటులోకి 146 భూగర్భ బంకర్లు

Last Updated : Jun 29, 2019, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details