తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2020, 3:09 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో కలకలం రేపుతున్న చిన్నారుల వరుస మరణాలు

జమ్ము కశ్మీర్​ ఉధంపూర్​ జిల్లాలో చిన్నారుల వరుస అనుమానాస్పద మరణాలు కలకలం రేపాయి. రాంనగర్‌ పరిసర ప్రాంతాల్లో  గత 15రోజుల్లో 10మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

jk children
కశ్మీర్​లో చిన్నారుల మరణాలు... 15రోజుల్లో 10మంది

‍జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చిన్నారుల వరుస అనుమానాస్పద మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఉధంపూర్‌ జిల్లా రాంనగర్‌ పరిసర ప్రాంతాల్లో గత 15 రోజుల్లో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతున్న వారంతా నాలుగేళ్ల లోపు చిన్నారులే.

పరిస్థితి అంచనా

ప్రాణాంతక వ్యాధి వల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు అనుమానిస్తుండగా... పరిస్ధితిని అంచనా వేసేందుకు వైద్య నిపుణుల బృందం రాంనగర్‌కు చేరుకుంది. అనేక మంది చిన్నారులు జ్వరం, వాంతుల సమస్యలతో అస్వస్ధతకు గురవుతున్నట్లు గుర్తించారు. స్థానికంగా సరఫరా చేసే నీటిని కూడా పరీక్షల కోసం పంపారు. ప్రజలు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని, పిల్లలకు జ్వరం, వాంతుల సమస్య వస్తే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి : 97ఏళ్ల వయస్సులో సర్పంచ్​.. రాష్ట్ర చరిత్రలో రికార్డు

ABOUT THE AUTHOR

...view details