తెలంగాణ

telangana

By

Published : Dec 2, 2020, 11:00 PM IST

ETV Bharat / bharat

అమిత్​ షాతో భేటీ కానున్న పంజాబ్​ సీఎం!

కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రైతులతో కేంద్రం కీలక చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

Amarinder to meet Shah ahead of crucial talks between Centre and farmers on Thursday
అమిత్​ షాతో పంజాబ్​ సీఎం భేటీ!

వ్యవసాయ చట్టాలపై వారం రోజులుగా రైతులు ఉద్ధృతంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ​కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో పంజాబ్ సీఎం అమరీందర్​ సింగ్​ సమావేశం కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతిష్టంభనకు స్నేహపూర్వక పరిష్కార కోసం సింగ్ గురువారం ఉదయం దిల్లీలో షాతో చర్చలు జరుపుతారని వర్గాలు తెలిపాయి.

రైతులకు మద్దతుగా ఉన్న అమరీందర్​.. సమష్టి ప్రయోజనం కోసం కేంద్రం, రైతుల మధ్య చర్చల్లో తాను, తన ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

అన్నదాతల సమస్యలపై గురువారం(డిసెంబర్​3) కేంద్రం చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం సాయంత్రం.. అమిత్​ షా నివాసంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ సమావేశమై రైతుల ఆందోళనపై చర్చించారు. తదుపరి వ్యూహాలపై సమాలోచనలు జరిపారు.

ఇదీ చూడండి:'సాగు చట్టాల రద్దుకై పార్లమెంటును సమావేశపర్చండి'

ABOUT THE AUTHOR

...view details