తెలంగాణ

telangana

బంగాల్​ భాజపా అధ్యక్షుడిపై ఈసీ ఆంక్షలు

By

Published : Apr 15, 2021, 8:46 PM IST

సీతల్​కుచి ఘటనలను ప్రస్థావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు భాజపా బంగాల్​ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 24 గంటలపాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది.

BJP's Dilip Ghosh
భాజపా బంగాల్​ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్

భాజపా బంగాల్​ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ 24 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఈసీ నిషేధం విధించింది. 'కొంత మంది హద్దు దాటండం వల్ల సీతల్​కుచిలో ఏమి జరిగిందో మీరందరూ చూశారు. అలా హద్దు దాటితే చాలా చోట్ల సీతల్​కుచి లాంటి ఘటనలు జరుగుతాయి' అని దిలీప్​ఘోష్​ అనడం వల్ల ఈసీ ఆయనపై చర్యలు తీసుకుంది.

ఏప్రిల్​ 15 సాయంత్రం 7గంటల నుంచి ఏప్రిల్​ 16 సాయంత్రం 7గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొంది. మరో సారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని దిలీప్​ ఘోష్​ను హెచ్చరించింది.

ఇదీ చదవండి:టీఎంసీకి చేటు చేస్తున్న దీదీ వ్యాఖ్యలు!

ABOUT THE AUTHOR

...view details