ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిరూపయోగంగా సంపద తయారీ కేంద్రాలు..!

By

Published : Jan 23, 2020, 7:06 PM IST

పెరిగిపోతున్న చెత్తకు పరిష్కారంగా... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లక్షలు వెచ్చించి సంపద తయారీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాటి నిర్వహణను మరిచారు. ఫలితంగా కాలుష్యం పెరుగుతోంది. ప్రజల ఆరోగ్యం పాడవుతోంది.

yerragondapalem dust centers are not working in prakasham
నిరూపయోగంగా.. సంపద తయారీ కేంద్రాలు

నిరూపయోగంగా సంపద తయారీ కేంద్రాలు..!
పల్లెల్లో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తకు పరిష్కారం చూపేందుకు... ప్రభుత్వం సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో 16 కేంద్రాలను నిర్మించారు. ఏర్పాటు చేసి నెలలు గడిచినా... చెత్త సేకరణ జరగడంలేదు. ఫలితంగా సంపద తయారీ కేంద్రాలు నిరూపయోగంగా మారాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు, ఖాళీ కొబ్బరి బొండాలను కాల్చేయటంతో కాలుష్యం పెరుగుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఈ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details