కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ నుంచి ఓబుళంపల్లెకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ముందున్న కారు డోర్ను డ్రైవర్ ఒక్కసారిగా తెరవటంతో దానిని ఢీకొని కిందపడ్డాడు. అదే సమయంలో ముందు నుంచి వస్తున్న ట్రాక్టర్ నర్సింహులుపై దూసుకుకెళ్లింది. ఈ క్రమంలో ఆయన అక్కడిక్కడే చనిపోయాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నర్సింహులు మరణ వార్త తెలుసుకుని పాఠశాల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పట్టణ సీఐ ఎన్వీ.రమణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా..ముందున్న కారు తలుపులను డ్రైవర్ తెరవటంతో ఢీకొని.. అక్కడిక్కడే మృతి చెందాడు.
ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి