కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉపకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కానిస్టేబుల్ రాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కారాగారం నుంచి తన గదిలో ఉన్న లైట్ను పగలగొట్టుకుని ఆ గాజు ముక్కలతో చేతిని కోసుకున్నాడు. అది గమనించిన కారాగార సిబ్బంది అతణ్ని..ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు తీసుకెళ్లారు. నంద్యాలలో హత్యాయత్నం ఘటనలో నిందితుడిగా ఉన్న రాజును 18 రోజుల కింద అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ ఉపకారాగానికి తరలించామని ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అరెస్టు అయి మూడు వారాలు గడుస్తున్నా బెయిల్ మంజూరు కాకపోవటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: కేసు పెట్టారని ప్రాణం తీసుకున్నాడు..!