ఆంధ్రప్రదేశ్

andhra pradesh

suspected death: గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం.. ఆత్మహత్యగా పోలీసుల అనుమానం

By

Published : Jul 7, 2021, 5:55 PM IST

కృష్ణా జిల్లా సూరంపల్లి గ్రామ సమీపంలోని పొలంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్దారించారు.

a women suspected death at surampalli
గుర్తుతెలియని మహిళ మృతదేహం

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. గ్రామంలోని శ్రీ విజయసాయి రియల్​ ఎస్టేట్ వెంచర్ సమీపంలోని పొలంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన గన్నవరం పోలీసులు.. ఒక సూసైడ్ లెటర్​​తోపాటు, పురుగుల మందు డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మృతురాలి వయసు సుమారు 45-55 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు.

"నా పేరు పి. శ్రీలక్ష్మి, నా కుమార్తెను సిద్దార్థ కాలేజ్​లో ఇంజినీరింగ్ చదివించాను" అని ఆ లెటర్ లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కూతురు.. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కారణంతో శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ప్రాథమికంగా చేసిన విచారణతో నిర్దారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details