కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడలోని తన నివాసంలో కాలు జారిపడటంతో తుంటి ఎముక దెబ్బతింది. గమనించిన కుటుంబసభ్యులు.. తులసిరెడ్డిని మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించడంతో.. తాను కడప వెళ్లి వైద్యం చేయించుకుంటామని తులసిరెడ్డి అన్నారు. ఫలితంగా ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి, కడపకు తరలించారు.