శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సంలో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో విలసిల్లాలి అని ఆకాంక్షించారు.
తెలుగు ప్రజలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశయాలు నెరవేరాలని, ఎదుగుదల, అభ్యున్నతికి మార్గాలు వేయాలని కోరారు.