ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని అమరావతిలోనే ఉండేలా చూడండి'

రాజధాని అమరావతిలోనే కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ.. రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు, తెదేపా ఎంపీలు.. దిల్లీలో రాష్ట్రపతిని, కేంద్రమంత్రుల్ని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వారికి వివరించారు.

By

Published : Feb 7, 2020, 12:31 PM IST

amaravathi farmers and jac leaders meets president ramnath kovind and central minister gadkari in delhi
దిల్లీలో రాష్ట్రపతి కోవింద్​ను కలిసిన అమరావతి రైతులు, ఐకాస నేతలు

దిల్లీలో రాష్ట్రపతి కోవింద్​ను కలిసిన అమరావతి రైతులు, ఐకాస నేతలు

దిల్లీలో ఏడో రోజు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు, రైతుల పర్యటన కొనసాగుతోంది. ఐకాస నేతలు, రైతులు, తెదేపా ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జోక్యం చేసుకునేలా కేంద్రానికి సూచన చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన ఐకాస నేతలు, రైతులు.. అమరావతిలోనే రాజధాని కొనసాగేలా చొరవ చూపాలని వినతిపత్రం అందించారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఐకాస నేతలు వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details