AP Brothers in Suicide Varanasi : ఏపీకి చెందిన ఇద్దరు యువకులు ఉత్తరప్రదేశ్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ, వినోద్ ఆగస్టు 28న వారణాసికి చేరుకున్నారు. ఆ తర్వాత భేలుపూర్లోని రామ్తారక్ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకున్నారు. రెండురోజులుగా ఆ గదిలో నుంచి దుర్వాసన రావడాన్ని సిబ్బంది గమనించారు.
రాష్ట్రానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు వారణాసిలో ఆత్మహత్య - ఏం జరిగి ఉంటుంది?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 10, 2024, 7:04 PM IST
West Godavari Brothers Suicide in UP (Etv Bharat)
దీంతో సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. దీనిపై వారు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు 2 రోజుల క్రితమే బలవన్మరణానికి పాల్పడ్డారని అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.