By ETV Bharat Andhra Pradesh Team
Published : 16 hours ago
తిరుమల బ్రహ్మోత్సవాలకు రండి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు టీటీడీ ఆహ్వానం
TTD Officials Invitation to Pawan Kalyan on Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ అధికారులు పవన్కు ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం పవన్కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. అయితే కొద్దిరోజుల క్రితమే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలిసి ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెలిసిందే.