బంగారం వర్కర్లపై దుండగులు దాడి - దొరికినంత దోచుకుని పరార్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 10:00 AM IST
Thieves Attack On Gold Workers In Vizianagaram District : దుండగులు బంగారం వర్కర్లపై దాడి చేసి కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనంపై రాజాం వెళ్తున్న ఇద్దరు బంగారం వర్కర్లపై గరివిడి మండలం అప్పనవలస సమీపంలో దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో వారిపై కారం చల్లి, రాడ్డుతో కొట్టి, తుపాకీతో కాల్పులు జరిపారు. వర్కర్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దాడి సమయంలో వర్కర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని చెట్లలో పడేశారు. దుండగులు వారి నుంచి సెల్ఫోన్లు, నగదు లాక్కొని పరారయ్యారు. స్థానికులు బాధితులను రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న రాజాం, గరివిడి పోలీసులు విచారణ చేపడుతున్నామన్నారు.