ఈనెల 16 న దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - ఆ అంశాలపై చర్చించేందుకే?
Published : Sep 10, 2024, 6:16 PM IST
CM Revanth Delhi Tour On September 16th : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న దిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో ఆయన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా దిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యవర్గ కూర్పుపై అధిష్ఠానంతో జరిగే భేటీలో సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించిన విషయం విదితమే. నామినేటెడ్ పోస్టుల విషయంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.