WOMEN MISSING AT SECUNDERABAD :సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన సోదరి తిరిగి సొంతూరుకు వెళ్లే క్రమంలో అదృశ్యం అయిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రాజస్థాన్కు చెందిన దేవేందర్ చౌదరి హైదరాబాద్లోని చింతల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి సోదరి లీలాదేవి రాఖీ కట్టేందుకు రాజస్థాన్ నుంచి వచ్చింది.
సోదరుడికి రాఖీ కట్టేందుకు రాజస్థాన్ నుంచి వచ్చిన సోదరి - తిరిగి వెళ్లే క్రమంలో అదృశ్యం
Published : Aug 31, 2024, 12:52 PM IST
WOMEN MISSING AT SECUNDERABAD (ETV Bharat)
ఆమెను సోదరుడు ఈ నెల (ఆగస్టు) 27న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి, హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కించాడు. కానీ ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో బంధువులు ఆ విషయాన్ని లీలాదేవి సోదరుడైన దేవేందర్కు తెలియజేశారు. వెంటనే దేవేందర్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.