national

సోదరుడికి రాఖీ కట్టేందుకు రాజస్థాన్ నుంచి వచ్చిన సోదరి - తిరిగి వెళ్లే క్రమంలో అదృశ్యం

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 12:52 PM IST

Leeladevi Missing Case
WOMEN MISSING AT SECUNDERABAD (ETV Bharat)

WOMEN MISSING AT SECUNDERABAD :సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన సోదరి తిరిగి సొంతూరుకు వెళ్లే క్రమంలో అదృశ్యం అయిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రాజస్థాన్​కు చెందిన దేవేందర్ చౌదరి హైదరాబాద్​లోని చింతల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి సోదరి లీలాదేవి రాఖీ కట్టేందుకు రాజస్థాన్ నుంచి వచ్చింది.

ఆమెను సోదరుడు ఈ నెల (ఆగస్టు) 27న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు తీసుకెళ్లి, హిస్సార్ ఎక్స్​ప్రెస్ రైలు ఎక్కించాడు. కానీ ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో బంధువులు ఆ విషయాన్ని లీలాదేవి సోదరుడైన దేవేందర్​కు తెలియజేశారు. వెంటనే దేవేందర్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details