national

రెండున్నర నెలల తర్వాత మళ్లీ ప్రజావాణి - ఖాళీగా దర్శనమిచ్చిన అర్జీదారుల క్యూలైన్లు

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 1:48 PM IST

Prajavani Program Starts Today
Prajavani Program Starts Today (ETV Bharat)

Prajavani Program Starts Today : రెండున్నర నెలల తర్వాత ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో గత రెండు నెలలుగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించలేదు. గురువారంతో కోడ్​ ముగియడంతో ఈరోజు తిరిగి ప్రారంభమైన ప్రజావాణికి ప్రజలు పెద్దగా హాజరు కాలేదు. అయితే ఎన్నికల కోడ్ ముగిసిన విషయంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే తక్కువగా హాజరయినట్లు సమాచారం.

దరఖాస్తుదారులు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం, గతంలో ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వినతి పత్రాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details